కృష్ణవంశీ దర్శకత్వంలో, మరాఠీ చిత్రం "నట్ సామ్రాట్" కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన చిత్రం "రంగమార్తాండ". ఉగాది కానుకగా నిన్న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి హైలీ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంల నటవిశ్వరూపాన్ని చూడవచ్చు.. అని చూసిన ప్రతిఒక్కరు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారిని మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ గారు శాలువా కప్పి సన్మానించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.