చురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న ఎనిమిదో సినిమా ఇది. సోమవారం ఉదయం 10.49 గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం షాట్కి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్నివ్వగా, శ్రేష్ఠ్ మూవీస్ అధినేత ఎన్.సుధాకర్రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్మరార్ స్క్రిప్ట్ని అందించారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 19 నుంచి నాన్స్టాప్గా జరుగుతుంది. చిత్ర ప్రారంభం సందర్భంగా దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ టైమ్ నేను ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తున్నాను. ఎంటర్టైన్మెంటే కాకుండా ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్లో ఉండే సినిమా ఇది’ అని అన్నారు.