ప్రముఖ సినీ,రంగస్థల నటుడు దీవి శ్రీనివాస దీక్షిత్ (63) దీక్షితులు కన్నుమూశారు. మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు తదితర చిత్రాల్లో దీవి శ్రీనివాస దీక్షిత్ సహజసిద్ధమైన నటనతో గుర్తిండిపోయే పాత్రల్లో నటించారు. సోమవారం సాయంత్ర హైదరాబాద్లోని నాచారంలో షూటింగ్లో ఉండగా హార్ట్ ఎటాక్తో ఆయన హఠాన్మరణం చెందారు. దీక్షితులు మరణంతో ఆయన కుటుంబంలో, సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. నాచారం నుంచి ఆయన భౌతికకాయాన్ని అమీర్పేటలోని ఇంటికి తరలించారు. నటుడు ఉత్తేజ్ దీక్షితులకు సమీప బంధువే. మంగళవారం దీక్షితులు అంత్యక్రియలు జరపనున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస దీక్షిత్ అధ్యాపకుడిగా పని చేశారు. నాటకాలపై ఆసక్తితో రంగస్థలంలో నటుడిగా, దర్శకుడిగా రాణించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పలు నాటకాల్లో నటించారు.