పుల్వామా ఉగ్రదాడి చాలామంది గుండెలను పిండేస్తోంది. భారతీయులందరూ పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. సైనికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపిన పాక్ ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ స్పందిస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ సినీ ప్రముఖులు పాక్ కళాకారులతో కలిసి పని చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశం నటులను, కళాకారులను తమ సినిమాల్లో తీసుకోమని ప్రకటించారు. తాజాగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాడు.
సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న ‘నోట్బుక్’ సినిమా నుంచి పాక్ సింగర్ అతీఫ్ అస్లామ్ను తొలగించాడు. ఆ పాటను అతనితో పాడించాలని అనుకున్నారు. కాగా, ఇప్పుడు ఆ పాటను తానే స్వయంగా పాడాలని నిర్ణయించుకున్నాడు సల్మాన్. ఇదిలావుండగా మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా తన తాజా చిత్రం ‘టోటల్ ధమాల్’ను పాకిస్తాన్లో విడుదల చేయనని ప్రకటించాడు. మనం ఎంత దయతో వున్నా వాళ్ళ రాక్షస నైజాన్ని మార్చుకోవడంలేదు. అప్పుడు మనం మన దయార్థ హృదయాన్ని మార్చుకోక తప్పదని దేశంలోని ప్రతీ పౌరుడు భావిస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం హర్షించదగిందని సోషల్ మీడియాలో చాలా మంది తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.