యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. తాజాగా సినిమా విడుదలను పోస్ట్పోన్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కొత్తగా రిలీజ్ డేట్, ట్రైలర్ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.