జయ జానకి నాయక సినిమా తరువాత బోయపాటి శ్రీను అసలు ఎవరితో సినిమాను చేస్తున్నాడు. నిజానికి 'సైరా' సినిమా మొదలవ్వకపోతే.. మెగాస్టార్ చిరంజీవినే డైరక్ట్ చేయాలి ఈ యాక్షన్ డైరక్టర్. అయితే ఒక ప్రక్కన మెగాస్టార్ 151వ సినిమా మొన్ననే మొదలైంది కాబట్టి.. ఖచ్చితంగా బోయపాటి వేరే హీరోతో సినిమా చేసుకోవాల్సిందే. ఇంతకీ ఆ కొత్త హీరో ఎవరు? ఆ మధ్యన బోయపాటి మరోసారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడనే టాక్ వచ్చింది. అసలు కన్ఫ్యూజన్ లో ఉన్న బాలయ్య కెరియర్ ను సింహా.. లెజండ్ వంటి సినిమాలతో బోయపాటి దారిలో పెట్టాడు. అందుకే మరోసారి వీరు జతకడుతున్నారని టాక్ వచ్చింది. కాని విషయం ఏంటంటే.. ఎప్పటినుండో మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ లతో సినిమాలు చేయాలని అనుకుంటున్న బోయపాటి.. ఇప్పుడు చరణ్ కు ఒక కథ చెప్పాడట. దానిని వినేసిన చరణ్.. తనకు కూడా బాగా నచ్చేయడంతో.. వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది.మొన్నటివరకు ధృవ, ఇప్పుడు రంగస్థలం.. రెండూ కూడానూ కాస్త డిఫరెంట్ స్టయిల్ సినిమాలే. అందుకే మధ్యలో ఒక మాస్ సినిమా పడితే ఆ లెక్క వేరేగా ఉంటుందని చరణ్ ఫీలయ్యాడట. పైగా సరైనోడు రిజల్ట్ చూశాక.. చరణ్ కూడా బన్నీ తరహాలో ఒక మాస్ హిట్ ఉవ్విళ్ళూరుతున్నాడని టాక్. అందుకే ఇప్పుడు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటాడని అంటున్నారు. అఫీషియల్ ప్రకటన ఏమన్నా ఇస్తారేమో చూద్దాం.