కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..500 సినిమాల్లో హీరో గా నటించి , నిర్మాతగా కూడా పలు సక్సెస్ లు అందుకున్న ఈయన.. కొడుకులు రంగంలోకి దిగాక సినిమాల జోరు తగ్గించాడు. మామ మంచు అల్లుడు కంచు సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న మోహన్ బాబు , మళ్లీ గాయత్రీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు మదన్ దర్శకత్వం లో మోహన్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ఈ మూవీ లో మోహన్ బాబు కూతురుగా ‘మేడమీద అబ్బాయి’ హీరోయిన్ నిఖిల విమల్ నటిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కూతురు మద్య నడిచే కథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీ లో ఓ కీలక రోల్ కోసం అనసూయ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. లక్ష్మి ప్రసన్న బ్యానర్ ఫై ఈ మూవీ నిర్మించబడుతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు కథ మాటలు అందిస్తున్నారు.