ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కె.విశ్వ‌నాథ్ చేతుల మీదుగా `ఇద్ద‌రు` టీజ‌ర్ విడుద‌ల‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 04:55 PM



యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి , రాధికా కుమార‌స్వామి, కె.విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ఇద్ద‌రు`. ఎఫ్‌.ఎస్. ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్‌.ఎస్‌.స‌మీర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫ‌రీన్ ఫాతిమా నిర్మాత‌. ఈ సినిమా టీజ‌ర్ లెజండ‌రీ డైర‌క్ట‌ర్ కె.విశ్వ‌నాథ్ చేతుల మీదుగా విడుద‌లైంది. నిర్మాత ఫ‌రీన్ ఫాతిమా మాట్లాడుతూ ``తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌ భాషల్లో భారీ స్థాయిలో తెర‌కెక్కించాం. అత్యుత్త‌మ సాంకేతిక నిపుణులంద‌రూ మా సినిమాకు ప‌నిచేశారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కెరీర్ బెస్ట్ చిత్రాలు `జెంటిల్ మేన్‌` ,`ఒకే ఒక్క‌డు` స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. హృద్య‌మైన ప్రేమ క‌థ‌, ఉత్కంఠ‌గా సాగే యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నెల్లోనే ఆడియో విడుద‌ల చేస్తాం. ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం `` అని అన్నారు.


ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.స‌మీర్ మాట్లాడుతూ ``కోట్ల ఆస్తి కోసం జ‌రిగే మైండ్ గేమ్ ప్ర‌ధానంగా ఈ చిత్రం సాగుతుంది. ప్ర‌తి ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.హైద‌రాబాద్‌, బెంగళూరు, మ‌హారాష్ట్ర‌, గోవా,థాయిలాండ్‌ లో షూటింగ్ చేశాం. ఈ నెల్లో పాట‌ల‌ను, వ‌చ్చే నెల్లో సినిమాను విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.


 


https://www.youtube.com/watch?v=gwihc5rtQGw






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com