ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఉన్నది ఒక్కటే జిందగీ’

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2017, 12:40 PM



రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి కథానాయికలు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. కృష్ణచైతన్య నిర్మాత. స్రవంతి రవికిషోర్‌ సమర్పిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త. ఈ మద్య విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది.


యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. గతంలో కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’ సినిమా తరహాలో ఈ చిత్రం విజయం సాదిస్తుందేమో చూడాలి. ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com