ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్‌ క్రష్‌ వరసలో త్రిప్తి డిమ్రి

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 04:33 PM



‘యానిమల్‌’తో  చిత్రంతో అమాంతంగా పాపులారిటీ సంపాదించుకుంది నటి త్రిప్తి డిమ్రి. సందీప్‌ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా హాట్‌హాట్‌గా అలరించారు. దీంతో ఈమెకు కూడా నేషనల్‌ క్రష్‌ అనే బిరుదు ఇచ్చేశారు నెటిజన్లు.  ఇప్పుడీ బ్యూటీకి అవకాశాలు వరుస కడుతున్నాయని టాక్‌ వినిపిస్తోంది. అయితే ‘యానిమల్‌’ చిత్రానికి ముందు త్రిప్తి గురించి పెద్దగా ఎక్కడా ప్రస్తావన వచ్చేది కాదు. సోషల్‌ మీడియాలోనూ ఆమెకు అంతగా క్రేజ్‌ కనిపించలేదు. కానీ ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్‌, ఫాలోయర్ల సంఖ్య పెరిగిపోయింది. ‘యానిమల్‌’ సినిమా ఈ నెల ఒకటో తేదీన విడుదలైన సంగతి తెలిసిందే! ఈ చిత్రం తర్వాత త్రిప్తి ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్య చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నవంబర్‌ చివరి వారంలో ఆమెకు 6లక్షల మంది  ఫాలోయర్లు ఉండగా, యానిమల్‌ విడుదల తర్వాత ఆ సంఖ్య 30 లక్షలకు చేరింది. ‘యానిమల్‌’లోని హాట్‌ సన్నివేశం గురించి ఆమె మాట్లాడిన మాటలు కూడా వైరల్‌ అయ్యాయి. ఆ సన్నివేశం సినిమాకు అవసరం కాబట్టి నటించడానికి అంగీకరించినట్లు ఆమె చెప్పారు. ఆ సీన తీసేటప్పుడు దర్శకుడు చాలా జాగ్రత్తలు వహించారనీ, అతి తక్కువ మంది సమక్షంలో దాన్ని చిత్రీకరించినట్లు త్రిప్తి తెలిపారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.600కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసింది. రణ్‌బీర్‌ సరసన రష్మిక నటించిన ఈ సినిమాలో బాబీ దేవోల్‌ విలన్ గా  ఆకట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com