తనను అంతా మలయాళీ అని అనుకుంటున్నారని.. అందరూ పొరబడుతున్నారని.. వాపోతోంది సాయి పల్లవి. తెలుగులో ఇప్పుడు చేతినిండా అవకాశాలు కలిగిన హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి తన నేపథ్యం గురించి చెప్పింది. చాలా మంది అనుకుంటున్నట్టుగా తను మలయాళీని కాను అని స్పష్టం చేసింది. తనది తమిళనాడు అని, ‘నేను తమిళియన్ని..’ అని సాయి పల్లవి వివరించింది.
మలయాళ సినిమా ‘ప్రేమమ్’తో సాయి పల్లవికి మంచి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఈమెకు దక్షిణాది చిత్రపరిశ్రమల్లో అవకాశాలు పెరిగాయి. రెండో అవకాశం కూడా మలయాళంలోనే వచ్చింది. ఆపై తమిళ, తెలుగు సినిమాల్లో వరసగా అవకాశాలు దక్కుతున్నాయి. తెలుగులో ‘ఫిదా’తో ఈమె దశ తిరిగిపోయింది. అయితే పరిచయం అయ్యింది... మలయాళ సినిమాతో కావడంతో చాలా మంది సాయి పల్లవిది కేరళ అని అనుకుంటున్నారు. ఇటీవల ఒక జర్నలిస్టు కూడా తనను మలయాళీ అనే సంబోధించాడని.. తనకు కోపం వచ్చిందని సాయి పల్లవి చెప్పింది.
అందుకే తను వివరణ ఇస్తున్నాను అని, మలయాళీని కాదు, తమిళనాడుకు చెందిన దాన్ని.. అని స్పష్టం చేస్తున్నా అని.. ఇక అందరూ తనను తమిళ అమ్మాయిగానే గుర్తించాలని సాయి పల్లవి కోరుతోంది.