మొత్తానికి సాయి తేజ్ హిట్ కొట్టడం మెగా అభిమానులు మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాల తర్వాత సక్సెస్ రావడం తో తేజ్ ఆనందానికి అవధులు లేవు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రలహరి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. సుప్రీం తర్వాత నన్ను కొందరు మిస్ గైడ్ చేశారని తప్పుడు సలహాలు ఇచ్చారని టాక్ వచ్చింది. కాని సుప్రీం తర్వాత చేసిన ప్రతి సినిమా నిర్ణయం కూడా నాదే. మంచి కథలను ఎంచుకోలేక మంచి సబ్జెక్ లు ఎంచుకోలేక పోవడం వల్లే నాకు ఫ్లాప్స్ వచ్చాయి. ఇందులో ఎవరి తప్పు లేదు అన్నాడు. నాకు ఫ్లాప్ ఇచ్చిన ప్రతి దర్శకుడు కూడా సారీ చెప్పాడు. ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు సాయి ధరమ్ తేజ్ కు మద్య విభేదాలు ఉన్నాయని గొడవలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదంతా కూడా కేవలం పుకార్లు మాత్రమే. నేను ఎక్కువగా రామ్ చరణ్ వరుణ్ తేజ్ లతో ఎక్కువగా కలుస్తాను. బన్నీతో చాలా అరుదుగా కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు స్టైల్ గురించి సినిమాల ఎంపిక గురించి మాట్లాడుకుంటాం. మా మద్య ఎలాంటి విభేదాలు లేవు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన మా మద్య ఎందుకు విభేదాలు ఉంటాయంటూ తేజ్ గొడవపై క్లారిటీ ఇచ్చాడు.