ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భరతనాట్యం' ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 02:53 PM



దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన 'భరతనాట్యం' చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. సూర్యతేజ ఏలే ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిత్ర బృందం నేడు విజయవాడ, గుంటూరులో ఈ సినిమాని ప్రమోట్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో హర్షవర్ధన్, వైవా హర్ష కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com