ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడిన 'రత్నం' విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 07:23 PM



భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. గతంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26, 2024న విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.


అయితే ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగల్ విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ని విడుదల చేసి వెల్లడించారు. ఈ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ ని వేయలేదు. దింతో ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com