ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెన్ అయ్యిన 'పారిజాత పర్వం' టికెట్ బుకింగ్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 03:19 PM



సంతోష్ కంభంపాటి రచన మరియు దర్శకత్వంలో చైతన్య రావు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'పారిజాత పర్వం' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యువ హాస్యనటుడు వైవా హర్ష, మాళవిక సతీశన్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తున్నారు. అనంత సాయి ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com