ప్రేమకథ చిత్రమ్’ చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ బాబు, ఆ మూవీ తర్వాత పెద్దగా విజయాలేవి దక్కలేదు. ఈ మద్య ‘శమంతకమణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ హీరో నూతన దర్శకుడు రాజశేఖర్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.
నటుడు కామ్ రైటర్ హర్షవర్ధన్ తాజాగా సుధీర్ బాబు కు ఓ లైన్ చెప్పడం జరిగిందట. ఆ లైన్ బాగా నచ్చడం తో సుధీర్ వెంటనే ఒకే చెప్పాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం హర్షవర్ధన్ ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అలాగే ఇంద్రగంటి దర్శకత్వంలో సుదీర్ బాబు మరో సినిమా చెయ్యబోతునట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు విజయం సాదిస్తే సుదీర్ బాబు కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అని అంటున్నారు.