టాలీవుడ్ చందమామ కాజల్..శర్వానంద్ పరువు తీసింది. ఈ ఏడాది శతమానం భవతి , మహానుభావుడు వంటి సూపర్ హిట్స్ తో సక్సెస్ రేంజ్ లో ఉన్న శర్వా సినిమాలో నటించేందుకు కాజల్ నిరాకరించడం ఇప్పుడు చర్చ గా మారింది. ప్రస్తుతం శర్వా సుధీర్ వర్మ దర్శకత్వం లో ఓ మూవీ చేయబోతున్నాడు.ఈ మూవీలో శర్వానంద్ ది డబుల్ రోల్. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా.. మరోటి మధ్యవయస్కుడి పాత్ర. ఇందులో మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కు జోడిగా కాజల్ ను తీసుకోవాలని భావించి ఆమెను సంప్రదిస్తే సింపుల్ గా నో చెప్పేసిందట. భారీ మొత్తం రెమ్యునరేషన్ ఇస్తామన్నా ఆ రోల్ చేయడానికి ఇష్టపడలేదుట. దాంతో చేసేది ఏమిలేక ఆ రోల్ కోసం తమన్నా కు ఒకే చేశారట. అయితే కాజల్ నో చెప్పడం ఫై అందరూ విమర్శిస్తున్నారు.