గత ఏడాది అమలాపాల్ పుదుచ్చేరిలో రూ.1.12 కోట్లు వెచ్చించి విలాసవంతమైన కారు కొన్నారు. కారును తన సొంత రాష్ట్రమైన కేరళలో కాకుండా తప్పుడు చిరునామాతో పుదుచ్చేరి ఆర్టీవో కార్యాలయంలో ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 20లక్షల రూపాయల పన్ను మాఫీ కోసమే పుదుచ్చేరిలో అమలాపాల్ కారు కొని తక్కువ పన్నుతో రిజిస్ట్రేషన్ చేయించారని సమాచారం. దీనిపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. కిరణ్ బేడీ ఆదేశంతో పోలీసులు అమలాపాల్ తప్పుడు అడ్రసుతో కారు రిజిస్ట్రేషన్ చేయించిన బాగోతంపై దర్యాప్తు చేస్తున్నారు. అమలాపాల్ తో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఇలా పన్ను ఎగ్గొట్టేందుకే పుదుచ్చేరిలో లగ్జరీ కార్లను కొని ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కిరణ్ బేడీ పోలీసులను ఆదేశించారు.