గరుడవేగ ప్రీమియర్ షోకి రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని నటుడు రాజశేఖర్ ఆహ్వానించారు. చిరంజీవి నివాసానికి రాజశేఖర్ దంపతులు స్వయంగా వెళ్లి చిరుని ఆహ్వానించారు. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై యాంగ్రీ యంగ్ మేన్గా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 3న విడుదలకు సిద్ధమైంది.