టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తల్లి చనిపోయిన బాధ నుంచి ఆయన ఇంకా తేరుకోని విషయం తెల్సిందే. ఈపరిస్థితుల్లో రాజశేఖర్ అన్న మురళి శ్రీనివాస్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే రాజశేఖర్ అమ్మ కూడా మరణించారు. కాగా, రాజశేఖర్ నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సమయంలో కుటుంబంలో విషాదం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.