ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు నెలల గ్యాప్ తర్వాత నాగచైతన్య మళ్లీ కెమెరా ముందుకు..

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 02, 2017, 03:09 PM



రెండు నెలల గ్యాప్ తర్వాత అక్కినేని నాగచైతన్య మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నాడు. అతడి కొత్త సినిమా ‘సవ్యసాచి’ రెగ్యులర్ షూటింగ్ కు రంగం సిద్ధమైంది. నవంబరు 8 నుంచే ఈ చిత్ర షూటింగ్ ఆరంభం కాబోతోంది. ‘యుద్ధం శరణం’ పూర్తి చేశాక రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న చైతూ.. ఆ తర్వాత సమంతతో పెళ్లి హడావుడిలో పడిపోయాడు. పెళ్లి తర్వాత ప్రస్తుతం అతను లండన్లో హనీమూన్ చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి తిరిగి రాగానే ‘సవ్యసాచి’ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు చైతూ.


తన కెరీర్లో ‘సవ్యసాచి’ ప్రత్యేకమైన సినిమా అవుతుందని చైతూ ఆశిస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అతను చాలా కాన్ఫిడెంటుగా ఉన్నట్లు సమాచారం. ‘యుద్ధం శరణం’ తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఈ సినిమా మంచి అవకాశమని అతను భావిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ‘కార్తికేయ’ లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయమై.. తనకు ‘ప్రేమమ్’తో మంచి విజయాన్నందించిన చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ ఈ సినిమా చేయనున్నాడు. ‘కార్తికేయ’ తరహాలోనే చందూ టచ్ ఈ సినిమాలో కనిపిస్తుందట. ఇందులో చైతూ ఓ భిన్నమైన పాత్ర చేస్తున్నాడు. ఇందులో అతడి ఎడమ చేయి తన మాట వినదు. దాని వల్ల అతను ఎలాంటి ఇబ్బందులెదుర్కొన్నాడో ఆసక్తికర రీతిలో చెప్పబోతున్నారు. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ తరహాలో సాగుతుందట. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ చైతూకు జోడీగా కనిపిస్తుంది. ఇందులో మాధవన్ ఓ కీలక పాత్ర చేస్తుండటం విశేషం. వచ్చే ఏడాది వేసవికి ‘సవ్యసాచి’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com