ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై లో ఉంటున్న ఈ ఏంజెల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 02, 2017, 03:13 PM



కుమారి 21ఎఫ్ తో టాలీవుడ్ కి పరిచయం అయినా హెబ్బా పటేల్ కుర్రకారును ఏ స్థాయిలో ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అమ్మడు మొదటి సినిమా రికార్డ్ స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత మాత్రం ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. అవకాశాలు కూడా అంత పెద్దగా ఏమి రావడం లేదు. వచ్చిన చిన్న సినిమాలతోనే కాలాన్ని గడిపేస్తోంది. 


అయితే అమ్మడు మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు చూపదట. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పాత్రలకు న్యాయం చేయడమే తన పని అంటోంది. అయితే అమ్మడు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఏంజెల్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఆ సినిమాపైన ఆశలు బాగానే పెట్టుకుంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హెబ్బా ఒక విషయాన్ని చెప్పింది. ఈ మధ్య టాలీవుడ్ లో అంతగా కనిపించడం లేదు ఏమిటి అంటే.. ముంబై లో ఇల్లు రెడీ చేసుకున్నాను అందుకే అక్కడ కొంచెం బిజీ అయ్యాను అని చెప్పుకొచ్చింది. 


అయితే నార్త్ నుంచి వచ్చిన కొంత మంది హీరోయిన్స్ ఇక్కడే సెటిల్ అవుతుంటే అమ్మడు మాత్రం సొంత నగరంలోనే ఉండడానికి ఇష్టపడుతోంది. తమన్నా - కాజల్ అలాగే తాప్సి ఇప్పటికే అక్కడ ఒక విల్లాలను కట్టేసుకున్నారు. అయితే అను ఎమ్మెన్యుయెల్ అలాగే రకుల్ తో పాటు రాశిఖన్నా మాత్రం  హైదరాబాద్ లో హోమ్ ని సెట్ చేసుకున్నారు. రకుల్ ఎక్కువగా టాలీవుడ్ లోనే ఉండడానికి ఇష్టపడుతుంటే కాజల్ తమన్నా మాత్రం తన సొంత ఊరైన ముంబాయ్ లో ఉంటూ ఇంకా బాలీవుడ్ లో కూడా అవకాశాలను దక్కించుకోవాలని చూస్తున్నారు.       






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com