పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాని 2018, జనవరి 10న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. దీని కోసం పెండింగ్లో ఉన్న షూటింగ్ని హీరో, డైరెక్టర్లు పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పనుల్లో బిజీగా ఉండటంతో ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతికి వెళ్లింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫొటోలు నెట్లో ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ సీరియస్గా ఉందనే న్యూస్లు వినిపిస్తున్న తరుణంలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ పోస్ట్ చేసిన సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సెట్స్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అను ఇమ్మానుయేల్ కూర్చుని టీ తాగుతుండగా, అను ఇమ్మానుయేల్ ఫోన్తో త్రివిక్రమ్ తీసిన సెల్ఫీని, తన ఇన్స్ట్రాగ్రమ్లో పోస్ట్ చేశారు అను. మంచి సంస్థలో మంచి సినిమా చేస్తున్నాం అన్నట్లుగా 'గుడ్ కంపెనీ, గుడ్ వర్క్' అంటూ కూడా పోస్ట్ చేశారు అను.