టాలీవుడ్తోపాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో అందాల తారగా గుర్తింపు పొందిన కిమ్ శర్మ తన భర్త అలీ పుంజాని నుంచి అధికారికంగా విడాకులు తీసుకొన్నట్టు బాలీవుడ్ పత్రిక కథనంలో పేర్కొన్నది. గతకొద్దికాలంగా ఎన్నారై వ్యాపారవేత్త అలీ పుంజానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన భర్తతో విడిపోయిన తర్వాత కిమ్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు పలు పత్రికలు వెల్లడించినట్టు తెలిసిందే.కెన్యా జాతీయుడైన అలీ పుంజానీతో విభేదాలు తలెత్తడంతో గత కొద్దికాలంగా వేర్వేరుగా ఉంటున్నారు.
అలీ పుంజానీ మరో యువతితో సహజీవనం చేస్తున్నారనే ఆరోపణలు వారి దాంపత్య జీవితంలో కలతలకు దారి తీసినట్టు చెప్పుకొంటారు. కెన్యా నుంచి చేతిలో నయాపైసా లేకుండా ముంబైకి చేరుకొన్న తర్వాత ఆమె అనేక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు వార్తలు వచ్చాయి.ముంబైలో అర్జున్ ఖన్నా అనే ఫ్యాషన్ డిజైనర్తో కిమ్ శర్మ అఫైర్ కొనసాగిస్తున్నట్టు గాసిప్స్ వచ్చాయి. ప్రస్తుతం సొంతంగా బిజినెస్ పెట్టే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం బ్రాండ్ స్ట్రాటెజిస్ట్గా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది.మూడు నెలల క్రితం దాఖలు చేసిన విడాకుల పిటిషన్కు కోర్టు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అంతేకాకుండా కిమ్ శర్మకు కోర్టు విడాకులు మంజూరు చేసినట్టు సమాచారం. అయితే తన విడాకుల విషయాన్ని కిమ్ శర్మ అధికారికంగా వెల్లడించకపోవడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది.అలీ పుంజానీతో విడిపోయిన తర్వాత చాలా కష్టాలు అనుభవించిన కిమ్ శర్మ ప్రస్తుతం తన బాయ్ఫ్రెండ్తో తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్టు ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం, మగధీర, అంజనేయులు తదితర చిత్రాల్లో నటించింది.