లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కొద్దిసేపటి క్రితం అపోలో హాస్పిటల్ లో గుండెపోటుతో జాయిన్ అయ్యారు. అకస్మాత్తుగా మణిరత్నం కు గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మణిరత్నానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మణిరత్నంకు ఇలా గుండెనొప్పి రావడం ఇది మూడోసారి. గతంలో 2004 వ సంవత్సరంలో యువ సినిమా సమయంలో మణిరత్నం గుండెపోటుకు గురయ్యారు. 2015 వ సంవత్సరంలో రెండో సారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. 2018 లో మరోసారి గుండెపోటుతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగానే హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం మరోసారి గుండెపోటు రావడంతో మణిరత్నాన్ని హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పలువురు సినీ ప్రముఖులు కోరారు.