మహేంద్రసింగ్ ధోనీ పై తనకున్న ఇష్టాన్ని మరోసారి బయటపెట్టింది బాలీవుడ్ భామ కైరా అడ్వాణి. ధోనీతో కలిసి బైక్ రైడింగ్కు వెళ్లాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించింది. ‘ఎమ్.ఎస్.ధోనీ-ద అన్టోల్డ్ స్టోరీ’ చిత్రంలో కైరా.. సాక్షి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.తాజాగా కైరా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రిపోర్టర్ ‘మీకు ఎవరితో కలిసి బైక్ రైడింగ్కు వెళ్లాలని ఉంది.’ అని అడగ్గా ఆమె ఏమాత్రం తడుముకోకుండా భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పింది. ‘ధోనీకి బైకులంటే ఎంతిష్టమో అందరికీ తెలుసు. రాంచీలో ధోనీ తన ఇంట్లో బైక్ల కోసం ప్రత్యేక గ్యారేజీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.’ అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో కైరా అడ్వాణి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా విజయ కూడా ఓ సినిమా చేయనుంది కైరా