టాలీవుడ్లో 'శివ మనసులో శృతి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ఇలా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంద. కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రలున్నా.. టాప్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఆమె తోటి హీరోయిన్లు టాప్ స్టార్స్గా దూసుకుపోతుంటే రెజీనా మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలిగింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళంలో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. అయితే తను ఈ స్థితిలో ఉండడానికి కారణం కెరీర్ ఆరంభంలో ప్రేమలో పడడమే అని గతంలోనే చెప్పిన రెజీనా.. ఈ నెల 13వ తేదీన వివాహ నిశ్చితార్థం అత్యంత రహస్యంగా జరిగిందనేది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తన కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని రెజీనా నిర్ణయించుకుందని టాక్.
గతంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగినా అప్పట్లో తమ మధ్య అలాంటిదేమీ లేదని, మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకుంటూ వచ్చింది. తాజాగా రెజీనా ఇప్పుడు జరిగిన ఈ నిచ్చితార్ధం పై స్పందించక పోవడంతో మౌనం అర్ధ అంగీకారంగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకీ రెజీనా పెళ్లి నిశ్చితార్థం విషయంలో నిజమెంత అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ విషయమై స్పందించిన కొందరు ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి త్వరలో పెళ్లి పీటలెక్కడానికి తొందర పడుతున్నట్లు కనిపిస్తోంది.మరోవైపు నటి శ్రియ లాగా చడీ చప్పుడు లేకుండా ఆ ముచ్చట జరుపుకుని తీరిగ్గా పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతుంది అని కొందరు గుసగుసలాడుతున్నారు. మరి రెజీనాను పెళ్లాడేవాడు ఒక బిజినెస్ మ్యాన్ అనే మ్యాటర్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఈ మ్యాటర్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.