సిక్కుమత గురువు గురునానక్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నవంబర్ 4 వ తేదీన సిక్కుల తొలి మత గురువు గురునానక్ జన్మించారు. ఈ సందర్భంగా సిక్కులందరూ గురునానక్ జయంతిని వైభవంగా జరుపుకుంటున్నారు.
బాలీవుడ్కు చెందిన ప్రముఖ తారలకు కూడా గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. చిత్రపరిశ్రమ అతిలోక సుందరి శ్రీదేవి, అజయ్ దేవ్గన్, అనిల్ కపూర్, రిషికపూర్, అబిషేక్ బచ్చన్, తదితరులు గురునానక్ జయంతి సందర్భంగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో పూజలు నిర్వహించారు. కాగా, శ్రీదేవి తాను స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. గురునానక్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపింది. అయితే, 54 ఏళ్ల వయసులోనూ శ్రీదేవి దేవకన్యలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో తమ ఆరాధ్య నటి ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.