నాగచైతన్య, సమంతల పెళ్లి తర్వాత అక్కినేని, దగ్గుబాటి కుటుంబం ఒక్కచోట కలిసి సందడి చేశారు. నూతన వధూవరులతోపాటు వెంకటేశ్, రానా, లక్ష్మి తదితర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. చై-సామ్ జంట చక్కగా ఉందంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఇది ‘గెట్ టు గెదర్’ పార్టీ అని సమాచారం. అయితే ఈ వేడుక ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.చైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన మారుతి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సినీయర్ నటి రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారట.సమంత ‘రంగస్థలం 1985’, ‘మహానటి’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితోపాటు పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నటించిన ‘రాజుగారి గది 2’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ అందుకుంది.