సూపర్స్టార్ మహేష్బాబు బయటి ఫంక్షన్లకు పెద్దగా హాజరు కాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల వేడుకులకు మాత్రమే వస్తుంటాడు. అలాంటిది ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మనవడి బర్త్డే ఫంక్షన్కు హాజరయ్యాడు. దిల్ రాజు మనవడు ఆరాన్ష్ జన్మదినం గత శనివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భార్య నమ్రతతో కలిసి మహేష్ హాజరయ్యాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `భరత్ అను నేను` సినిమా చేస్తున్న మహేష్.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి రూపొందించబోయే సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.