రాజశేఖర్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారుకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి సీక్వెల్ రానుందని తాజా ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పారు. ఇప్పటికే
‘గరుడ వేగ’ సీక్వెల్ కి ప్రవీణ్ సత్తారు ఆల్రెడీ కథను సిద్ధం చేశాడు. ఆయన నిర్మాత సి.కల్యాణ్ కి కథను వినిపించడం .. కల్యాణ్ కి నచ్చడం జరిగిపోయాయి. ఇక నేను వినవలసి వుంది అన్నారాయన. ప్రవీణ్ సత్తారు గురించి నాకు తెలుసు గనుక, ఆ కథ బాగుంటుందనే అనుకుంటున్నాను. అన్నీ కుదిరితే ‘కల్కి’ తరువాత నేను చేసే సినిమా అదే అవుతుంది” అని చెప్పారు రాజశేఖర్.