వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో రూపొందాల్సిన ‘సరిలేరు నీకెవ్వరూ’ క్లాప్కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. చిత్రానికి ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే బిజినెస్ వర్గాలలో సైతం క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ రేటు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.