రామ్ చరణ్ నిర్మాతగా తన తండ్రి చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం సైరా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు చిత్ర యూనిట్ చెపుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, క్వాలీటీ ఖచ్చితంగా ఉండేలా రామ్ చరణ్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నట్టు ఆ వర్గాలు చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు అప్పుడే ధియేటర్ల బుకింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.