'ఏక్ థా టైగర్' సినిమా బాలీవుడ్ లో ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా నుంచి 'ట్యూబ్ లైట్' వరకు సల్మాన్ కు పరాజయమన్నది లేకుండా పోయింది. 'ట్యూబ్ లైట్' డిజాస్టర్ గా నిలించింది. ఈ నేపథ్యంలో 'ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్ గా 'టైగర్ జిందా హై' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఎంతో ఉత్కంఠకు గురి చేస్తోంది. ఇంతవరకు ఎవరూ సాహసించని సబ్జెక్ట్ ను అలీ అబ్బాస్ జఫర్ డీల్ చేశాడు. సల్మాన్ తరహా మాస్ ఎలిమెంట్స్ తో పాటు..సల్మాన్ కు ఎంతో అచ్చొచ్చిన భారత్-పాక్ సంబంధాన్ని కూడా ఇందులో చూపించాడు. సల్మాన్ తోపాటు అతని మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ కూడా ఫైట్లు ఇరగదీసింది. ట్రైలర్ లో డైలాగులు అదిరిపోయాయి.