ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుకార్లకు చెక్ పెట్టిన త్రివిక్రమ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2017, 01:07 PM



ప్రస్తుతం 'అజ్ఞాతవాసి' సినిమా పనుల్లో త్రివిక్రమ్ బిజీగా వున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో .. 80 దశకంలో వచ్చిన ఓ పాప్యులర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వచ్చింది. ఆ నవలను సినిమాగా తీయడానికి అవసరమైన రైట్స్ ను, భారీ మొత్తమే చెల్లించి త్రివిక్రమ్ సొంతం చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.  ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న త్రివిక్రమ్ ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ తో తాను చేయనున్న సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కనుందనే విషయంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. తన గత చిత్రాల మాదిరిగానే కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఈ సినిమా వుంటుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం 'టబు' ఖరారైపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com