ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాహిద్ క‌పూర్ బ్రదర్ తో జాహ్నవి రొమాన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2017, 04:05 PM



కొత్త నటీనటులు ఆకాశ్‌ తోసర్‌, రింకూ రాజ్‌గుర హీరో హీరోయిన్లుగా మరాఠీలో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘సైరత్‌’. నాగరాజ్‌ మంజులే దర్శకుడు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు వంద కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.ఆమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖుల మనసు దోచుకుందీ సినిమా. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ‘సైరాట్‌’ చిత్ర రీమేక్ ద్వారా న‌టి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి బాలీవుడ్ రంగ‌ప్ర‌వేశంచేయనుంది. ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ స‌వ‌తి సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టించ‌నున్నాడు. ‘బ‌ద్రినాథ్ కీ దుల్హానియా’ చిత్ర ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ సినిమా ఎప్పటి నుండో చర్చలో ఉంది . ఐతే తాజాగా దీన్ని ఫైనల్ చేశారని టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com