ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందీప్ చేప్పినా స్టోరీ విని ఫిదా అయినా వర్మ

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2017, 10:08 AM



‘అర్జున్‌రెడ్డి’తో మంచి విజయంఅందుకొన్న దర్శకుడు సందీప్‌ వంగా మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా కథను తొలుత దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వినిపించారట. ఈ విషయాన్ని వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.


సినిమా కథ విని తాను కుళ్లుకుంటున్నానని చమత్కరించారు. ‘సందీప్‌ తనతర్వాతి చిత్రం కాన్సెప్ట్‌ నాకు చెప్పారు. అది విని నేను చాలా కుళ్లుకుంటున్నాను. ఈ సినిమా కథతో పోలిస్తే ‘అర్జున్‌రెడ్డి’ ఫ్లాపైనట్టే. ఎందుకంటే సందీప్‌ తర్వాతి చిత్రం మెగా సక్సెస్‌ అవుతుంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు వర్మ.


‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు వర్మ మద్దతుగా నిలిచారు. సినిమా వివాదాస్పదంగా మారిన సమయంలో ఆయన ఎంతో సపోర్ట్‌ చేశారు కూడా. ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలో అక్కినేని నాగార్జునతో కొత్త ప్రాజెక్ట్‌ మొదలుపెట్టబోతున్నారు. నవంబర్‌ 20న ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com