తెలుగు బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేసిని బిగ్బాస్ షో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీజన్ 1కి సినీ నటుడు శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఓటింగ్ సిస్టమ్ ద్వారా జరిగిన ఈ ఎంపిక చివరి వరకు ఎంతో ఉత్కంఠతతో కొనసాగింది. ఇక సీజన్ 1 ముగిసింది. సీజన్ మొదలు కాబోతుంది. సీజన్ 2లో చేయబోయే పార్టిసిపెంట్స్ కోసం సదరు ఛానెల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అయితే ఈ పార్టిసిపెంట్స్ విషయంలో తాజాగా షాకింగ్ విషయం ఒకటి బయటికి వచ్చింది. సీజన్ 1కి విజేతగా నిలిచిన శివబాలాజీ భార్య మధుమితని సీజన్2లో పార్టిసిపెంట్గా తీసుకోవాలని ఈ షో నిర్వాహకులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. సీజన్ 1లో గెస్ట్గా వచ్చిన ఎపిసోడ్కి కూడా మంచి రేటింగ్స్ రావడంతో అప్పుడే సీజన్ 2 కోసం మధుమితని సంప్రదించారనే వార్తలు కూడా వినిపించాయి. రీసెంట్గా ఆమెకు అసభ్య మెసేజ్ల వస్తున్నాయంటూ శివబాలాజీ సైబర్ పోలీసులను సంప్రదించిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో హైలైట్ అయిన మధుమితని సీజన్ 2కి తీసుకుంటే షోకి మంచి హైప్ వస్తుందని భావించి, షో యాజమాన్యం ఆమెను సంప్రదించినట్లుగా టాక్. అయితే ఆమె ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి నిరాకరించిందని తెలుస్తోంది. దీంతో ఆమె భారీ ఆపర్ని తిరస్కరించిందని అనుకుంటున్నారు. ప్రస్తుతం శివబాలాజీ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.