విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో యూనిట్ సభ్యులు ఉన్నారు. మ్యూజిక్ ఫెస్టివల్స్ పేరుతో సౌత్ ఇండియా మొత్తం తిప్పేస్తున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో ముద్దు సీన్స్ ఉన్న కారణంగా యూ/ఎ ఇచ్చారు.
విడుదలకు ఇంకా వారం రోజులు ఉండగానే సెన్సార్ పూర్తి చేయించడం విశేషం. ఈ చిత్రం నిడివి 170 నిమిషాలుగా ఖరారు చేయడం జరిగింది. ఈమద్య కాలంలో రెండున్నర గంటలకు ఎక్కువగా సినిమాను ఉండనివ్వడం లేదు. కాని ఈ చిత్రం మాత్రం 10 నిమిషాలు తక్కువ మూడు గంటల పాటు చూపించబోతున్నారు. విజయ్ దేవరకొండ మూవీ కనుక ఎంత ఉన్నా చూస్తారని మేకర్స్ అభిప్రాయం కావచ్చు. సినిమా బాగుంటే ఎంతైనా చూడవచ్చు. కాని కంటెంట్ సరిగా లేకుంటే మాత్రం ఈ నిడివి వల్ల కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంపై అంచనాలు పీక్స్లో ఉన్న సమయంలో సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.