మిల్కీబ్యూటీ తమన్నా తన కెరీర్ ముగిసేలా ఉండటంతో వచ్చిన ప్రతి అవకాశం చిన్న, పెద్ద పాత్ర తేడాలేకుండా నటించాలని ఇక నిర్ణయించుకుందని ఫిలింనగర్ టాక్ ఇటీవేలో ఓంకార్ ఇచ్చిన ఆఫర్ ను వదులుకున్న అమ్మడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి లో ఓ చిన్న పాత్ర లో కనిపించనుంది. రెండు తమిళ్ సినిమాలు మాత్రమే చేతిలో ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఛాన్స్లు దొరక్క కొట్టుమిట్టాడుతోందట. అమధ్య తమన్నా నటించిన బాలీవుడ్ క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మి సినిమా కొనడానికి కూడా డిస్ర్టిబ్యూ టర్ ముందుకు రాక ల్యాబ్ లోనే మూలుగుతోంది. దీంతో చిన్న చితకా పాత్రలకూ రడీ అయిపోతోందట.
కాగా ఆ మధ్య మహాలక్ష్మి రివ్యూ చూసిన `అ `సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ తమన్నాను కలిసి ఓ కథ వినిపించడట. ఇది పెద్దాపురంలో ఉండే ఓ వేశ్య కథ. కథ. నచ్చడంతో వెనకాముందు ఆలోచించకుండా ఒప్పేసుకుందిట. కొన్ని వాస్తవ పాత్రలను ఆధారంగా చేసుకుని దర్శకుడు ఆ కథను సిద్దం చేసుకున్నాడ దర్శకుడు. ఇక్కడ కడుపు నింపు కోవడం కోసం పడుపు వృత్తి జీవనాధరంగా బతుకున్నతు న్నఓ వేశ్య కథ చాలా స్ఫూర్తిగా ఉండటంతోనే ఈ సాహసానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.