బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా టీవీల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు సందేశాత్మక ప్రకటనలు ఇస్తుంటారు. గతంలో ఆమె ఒకసారి దీపావళి సందర్బంగా ప్రజలను టపాకాయలు కాల్చవద్దని, ఎందుకంటే తనకు ఆస్తమా ఉందని, పొగ పడదని, తనలాగే చాలామంది ఉంటారని చెప్పుకొచ్చింది. ఆ తరువాత తన పెళ్లిలో భారీగా టపాసులు పేల్చారు. తాజాగా ఆమె భర్త నిక్ జోనస్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మియామీ బీచ్లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కింది. ఆ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్లు ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు. సలహాలు ఇవ్వడం కాదు పాటించాలని కొందరు, మీకు టపాకాయల పొగ పడదు కానీ సిగరెట్ పొగ పడుతుందా అంటూ మరొకొందరు విమర్శలు చేస్తున్నారు.