సినీరంగంలో ఎంత డిమాండ్ ఉంటే అంతగా వెలుగుతున్నట్లు లెక్క. అందుకే ఎప్పుడూ డిమాండ్తో ఉండాలని నటీనటు లు కోరుకుంటుంటారు. అయితే అనుకున్నంత మాత్రాన వచ్చేది కాదు ఇది. మంచి హిట్లు రావడంతో పాటు పాత్రోచితంగా మె ప్పించినపుడే నటీనటులకు డిమాండ్ వస్తుంటుంది. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న చందాన వారు తమ పారి తోషికాన్ని పెంచేస్తుంటారు. ఇప్పుడు అందాల భామ కియరా అద్వాణీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. బాలీవుడ్లో కొన్ని సిని మాలు చేసిన తర్వాత టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఆమె మహేష్ సరసన భరత్ అనే నేను, రామ్చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్రం కియరాకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత వినయ విధేయ రామ అనుకున్నంతగా ఆడక పోయినా… తాజాగా హిందీలో నటించిన కబీర్సింగ్ చి త్రం తర్వాత ఆమెకు డిమాండ్ మరింతగా పెరిగిందని అంటున్నారు. తెలుగులో విజ యం సాధించిన అర్జున్రెడ్డి చిత్రాన్ని దర్శకు డు సందీప్రెడ్డినే హిందీలో కబీర్సింగ్ పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తినా దాదాపు 250 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీసు వద్ద వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక అందులో కథానా యికగా నటించిన కియరా యువ ప్రేక్షకుల హృదయాలలో కొలువయ్యారు. దీంతో ఆమెను తమ సినిమాల్లో నటింపజేసేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. బాలీవుడ్లో ఇప్పుడు ఆమెకు అవకాశాలపై అవకాశాలొస్తున్నాయి. తాను కోరుకున్న స్థాయి డిమాండ్ ఇంతకా లానికి సాకారం కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవని అం టున్నారు. ఇప్పటికే అక్షయ్కుమార్ నటిస్తున్న గుడ్న్యూస్, లక్ష్మీ బాంబ్ చిత్రాలలో , సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న షెర్షాహ్ చిత్రం లోనూ కియరా కూడా నటిస్తోంది. ఇందులో కరణ్జోహార్ రెండు చిత్రాలకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు పలు నూతన చిత్రాల కోసం కియరాను బాలీవుడ్ సంప్రదిస్తోందట