బాలకృష్ణతో పాయల్ రాజ్పుత్ జోడీ కట్టనుందట. బాలయ్య-కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్టు సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధమవుతుండటం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషించనున్నాడట. సినిమాను సెట్స్పైకి తెచ్చేందుకు నిర్మాత సి కల్యాణ్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ సిమాలో పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్స్టర్.. రెండు షేడ్స్లోని పాత్రలు బాలయ్య చేయనున్నాడట. ఇద్దరు కథానాయికలతో ఒక హీరోయిన్గా పాయల్ రాజ్పుత్ను కన్ఫర్మ్ చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. క్రాంతి టైటిల్తో ఈ సినిమా రావొచ్చన్న అంచనాలున్నాయి.