తెలుగు తెరపై యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్కు మళ్లీ మంచిరోజులు వచ్చేశాయి. ఆయన నటించిన గరుడ వేగ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతున్నది. ఎన్నో సంవత్సరాల తర్వాత సక్సెస్ రుచి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూతురు శివాని గురించి ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.గతంలోనే రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు వచ్చాయి. తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నారనే విషయం బయటకు పొక్కినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు.గరుడ వేగ సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ శివానీ సినీ ఎంట్రీపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శివానీ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నది. అటువైపు చదువుతూనే మరోవైపు యాక్టింగ్ దృష్టిపెట్టినట్టు సమాచారం.