ప్రస్తుతం టాలీవుడ్ లో మలయాళ హీరోయిన్స్ హావ నడుస్తుంది..వారిలో ఒకరైన కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈమె నేను శైలజ , నేను లోకల్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మహానటి సినిమా తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాత వాసి చిత్రాలలో నటిస్తుంది. దీంతో సోషల్ మీడియా లో అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.తాజాగా ఈమె ట్విట్టర్ ఖాతా ఒక మిలియన్( పది లక్షలు) ఫాలోవర్స్ కు చేరింది. ఈ సందర్భంగా తన ఫాలోవర్స్కి, అభిమానులకి కృతజ్ఞతలు తెలిపింది. నాలుగేళ్ళుగా నన్ను ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారు. మరెంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అని కీర్తి ట్వీట్ చేసింది.