ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రిష పై చిందులేసిన నిర్మాత

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2017, 10:01 AM



చెన్నై బ్యూటీ త్రిష కెరీర్ ఇప్పటికీ ఫుల్ స్వింగ్ లోనే ఉంది. ఎప్పుడో మిలీనియం టైంలో కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష.. 15 ఏళ్లుగా సౌత్ లో సినిమాలు చేస్తూనే ఉంది. తమిళ్.. తెలుగు భాషల్లోనే సినిమాలు చేసినా.. మధ్యలో ఒకసారి బాలీవుడ్ ప్రయత్నం కూడా చేసింది. ప్రస్తుతం మలయాళంలో మొదటి సినిమా చేస్తున్న త్రిష చేతిలో.. ఇప్పుడు కూడా అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.


ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నడూ త్రిష బిహేవియర్ పై.. ప్రొఫెషనలిజంపై పెద్దగా కామెంట్స్ వచ్చిన పరిస్థితి లేదు. కానీ రీసెంట్ గా విక్రమ్ హీరోగా నటిస్తున్న సామీ స్క్వేర్ షూటింగ్ నుంచి త్రిష వాకౌట్ చేసిందనే న్యూస్ సెన్సేషన్ అయింది. ఈ టాపిక్ పై కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా రియాక్ట్ అయ్యాడు. అక్కడ త్రిష పేరు ప్రస్తావించకపోయినా.. ఈయన కామెంట్స్ త్రిషా కృష్ణన్ నే అనే సంగతి అర్ధమైపోయింది. విజయ్ ఆంటోనీ నటించిన అన్నాదురై ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన జ్ఞానవేల్ రాజా.. 'రీసెంట్ గా ఓ హీరోయిన్ ను కలిసేందుకు ఆ చిత్ర నిర్మాతతో కలిసి హోటల్ కు వెళ్లాం. 10 గంటలకు పైగా అక్కడ వెయిట్ చేసినా ఆమె మమ్మల్ని కలిసేందుకు ఇష్టపడలేదు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు' అంటూ కామెంట్ చేశాడు జ్ఞానవేల్ రాజా.


మరోవైపు ఓ హీరో 29 రోజుల పాటు షూటింగ్ చేసి.. 30 శాతం షూటింగ్ పూర్తి కాగానే రిలీజ్ చేయాలని ఒత్తిడి చేశాడని.. ఆ నిర్మాత 18 కోట్లు నష్టపోయాడని జ్ఞానవేల్ రాజా అన్నాడు. ఈ హీరో శింబు అని.. ఆ సినిమా ఏఏఏ అని కూడా చెప్పకనే చెప్పినట్లుగా అయింది. ఓ నిర్మాత.. స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నవారిపై ఇంత బాహాటంగా విమర్శలు చేయడం సంచలనం అవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com