నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. ప్రమాదం తర్వాత కారు వదిలి పారిపోవడానికి కారణం ఏంటో చెప్పాడు. నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. సడెన్ టర్నింగ్ ఉండడంతో కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టిందన్నాడు. సాయం కోసమే తన ఇంటి వైపు పరిగెత్తానని తెలిపాడు. 3 నెలలుగా అదే రోడ్డుపై వెళ్తుంటా అని రాజ్ తరుణ్ చెప్పాడు. అక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయిని చెప్పాడు. కారు డ్రైవింగ్ సమయంలో సీటు బెల్టు ధరించానని తెలిపాడు. ఊహించని పరిణామంతో కళ్లు బైర్లు కమ్మాయన్నాడు. భారీ శబ్దం రావడంతో చెవులు మూసుకుపోయాయని, గుండె దడ పెరిగిందని అన్నాడు. సాయం కోసమే ఇంటి వైపు పరిగెత్తాను తప్ప మరో కారణం లేదన్నాడు. తన ఇంటికి దగ్గరలోనే ప్రమాదం జరిగిందన్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలో షూటింగ్కు హాజరవుతా' అంటూ తన ట్విటర్ పేజ్లో మెసేజ్ను పోస్ట్ చేశారు.