ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సాహో’ ఒకటి. ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. దాదాపు రూ.350 కోట్లతో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం ‘సాహో’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ను పొందింది. వివరాల ప్రకారం 2గంటల 54 నిమిషాలు రన్ టైమ్తో సినిమా లాక్ అయ్యిందని టాక్. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటించిన ఈ చిత్రంలో జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా ఆగస్ట్ 30న సినిమా కావడం ఖరారైంది.