ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తదుపరి షెడ్యూల్ కోసం వారణాసికి బయల్దేరనున్న అజ్ఞాతవాసి

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2017, 12:48 PM



పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్ అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. హైదరాబాద్ యూరప్ లలో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను వారణాసి అలహాబాద్ ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 15వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించి, సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు. పవన్ 25వ సినిమాగా త్రివిక్రమ్ తో చేస్తోన్న మూడవ సినిమాగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు వున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com