ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఎవరు’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు : మహేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2019, 06:12 PM



అడవి శేష్ హీరోగా తెరకెక్కిన 'ఎవరు' సినిమా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం బాగుందంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఎవరు’ సినిమా చూశా. అద్భుతమైన కాన్సెప్టుతో సీటు అంచున ప్రేక్షకుడ్ని ఉంచే థ్రిల్లర్‌ ఇది. బాగా డైరెక్ట్‌ చేశారు. సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో అడివి శేష్‌, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌ పోస్ట్‌ చేశారు. దీనికి అడివి శేష్‌ స్పందించారు. ‘ఆన్‌ అండ్‌ ఆఫ్‌ స్క్రీన్‌లో మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సూపర్‌స్టార్‌. ‘మేజర్‌’ సినిమాతో కూడా మీరు గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నా’ అని అన్నారు. మహేశ్‌ నిర్మిస్తున్న ‘మేజర్‌’ సినిమాలో అడివి శేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com